ద్విపదభాగవతం - మధురకాండ : అక్రూరుఁడు శ్రీకృష్ణుని స్తుతియించుట
బంధురార్భనలిచ్చి ప్రణతుఁడై నిలిచి
“మాన్యుఁడనైతిని మత్కులంబెల్ల
ధన్యమై వెలుఁగొందె తామరసాక్ష!
కులముద్దరించితి కులశైలధైర్య!
నీవె భూతంబుల నెరయఁ బుట్టించి
ప్రోవనడపఁగనోపు పురుషుండ వీవ
సకలంబుఁ గనుఁగొను సాక్షివి నీవ
వసుదేవునకును దేవకికుద్భవించి
వసుధభారము మాన్చి వైరుల నడఁచి - 440
యక్షయ! నీచేత నసురసైన్యంబు
లక్షోహిణిశతం బణంగిపోగలదు;
దేహబంధంబులుఁ దెలియంగ లేక
మోహాంధుఁడైన నా మోహపాశములుఁ
దెగఁగోసి నాకోర్కి తెఱవానతిమ్ము
సగుణనిర్గుణరూప! సత్యసల్లాప!”
ixఅని వేడుకొనియెడు నక్రూరుఁ జూచి